రాజాసింగ్ ను కలిసిన బుక్క వేణుగోపాల్
భారీ ర్యాలీగా వెళ్లి కలసిన బుక్కా వేణుగోపాల్
ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్న రాజాసింగ్
(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బుక్కా వేణుగోపాల్ ఏకంగా భారీ ర్యాలీతో వెళ్లి రాజాసింగ్ కు అభినందనలు తెలిపారు. బుక్కా వేణుగోపాల్ కు రాజాసింగ్ ఆ ప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.
ఇదిలావుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్" ను బిజెపి రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలా ఉంటే ఇటీవల రాజాసింగ్ బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఆయనపై పెట్టిన పీడీ యాక్ట్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ను బిజెపి రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజా సింగ్ తన మద్దతును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, జూకల్ ఎంపీటీసీ, శంషాబాద్ బీజేవైఎం అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, శంషాబాద్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: