అపు ఇవ్వాలని వ్యక్తిపై దాడి

కేసు నమోదు చేసిన గడివేముల ఎస్ఐ బి. టీ వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

తన అప్పు చెల్లించాలని బాధితుడిపై దాడిచేసిన వారిపై  గడివేముల ఎస్.ఐ. బీ.టీ.వెంకట సబ్బయ్య కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్లితే.. నంద్యాల జిల్లా గడివేముల లో గత 24 వ తేదీన రాత్రి  8.00 గంటల సమయంలో  చిక్కొండు బాలకృష్ణ ( 26 ) గడివేముల లోని వలి కూల్ డ్రింక్ షాప్ వద్ద తన సొంత పని మీద వెళ‌్తుండగా బిలకల గూడూరు గ్రామానికి చెందిన మంద ప్రతాప్, కాటేపోగు రాజులు దాడి చేశారు. తమకు ఇవ్వాల్సిన రూ.1వెయ్యి అప్పు తిరిగి చెల్లించాలన్న వారు చిక్కొండు బాలకృష్ణపై దాడి చేశారని, దాడి చేసే సమయంలో దాడికి పాల్పడ్డవారు మధ్యం సేవించివున్నారని తెలిసింది. బాధితుడు చిక్కొండు బాలకృష్ణ పై దాడికి పాల్పడ్డవారు కళ్లు, చేతులతో  దాడి చూసి నీ అంతు  చూస్తామని బెదిరించారని  గడివేముల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గడివేముల ఎస్.ఐ. బీ.టీ.వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: