కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆత్మహత్య చేసుకుంటామని

సిపిఐ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా లో నకిలీ సీడ్స్ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నకిలీ విత్తనాలను అరికట్టలేని వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని, నకిలీ విత్తనాల కంపెనీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నూనెపల్లె లోని  వ్యవసాయ శాఖ అధికార కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి తాళాలు వేసి బయటికి పంపించారు. అనంతరం జెడి గారిని కలవాలని రైతులు పట్టు పట్టడముతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని ఏడి రాజశేఖర్ తెలపడంతో, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి నకిలీ విత్తన యజమానులపై చర్యలు తీసుకోవాలని,విత్తన సంస్థలకు సహకరిస్తున్న ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని,నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం చేరుకొని సిపిఐ, కార్మిక, ప్రజాసంఘాల నాయకత్వాన ధర్నా నిర్వహించి, రైతులు మెడకు ఉరితాళ్ళు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ లు   మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి పంట చేతికి రాకపోగా అప్పులపాలవుతున్నా అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ముఖ్యంగా కావేరి, ప్రభాస్ విత్తన సంస్థలు నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని


తెలిసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని గోస్పాడు, పాణ్యం, నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ మండలాలకు చెందిన రైతులు నష్టపోయారని ఆరోపించారు. అలాగే పత్తి పంట వేసిన రైతులు పంట వేపుగా పెరిగింది గాని దీనివల్ల కాయలు చెట్టుకు కాయడం లేదని, వైరస్ సోకి లక్షల రూపాయలు నష్టపోవడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలని, బ్యాంకులలో తీసుకున్న రుణాలను ఎత్తివేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వము, అధికార యంత్రాంగం న్యాయం చేయకపోతే వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తయారు చేయడానికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న నకిలీ విత్తనాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పీడియాక్ట్ కింద కేసు నమోదు చేసి వారికి సహకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో స్పందించిన జెడి మాట్లాడుతూ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురామ్మూర్తి, సుంకయ్య, సిపిఐ నాయకులు రమేష్ కుమార్, భాస్కర్, సామెల్, హరినాథ్, భూమని శ్రీనివాసులు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: