రేషన్ బియ్యం పట్టివేత...కేసు నమోదు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని  మంచాల కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఆర్బీసీ కెనాల్ బ్రిడ్జి వద్ద డోన్ పట్టణానికి చెందిన గొల్ల జయన్న (49) , కురుకుంద గ్రామం ఆత్మకూరు మండలానికి చెందిన సయ్యద్ ఖలీల్( 27), నంద్యాల పట్టణానికి చెందిన దూదేకుల దస్తగిరి ( 32)  ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని (పీడీఎస్) ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏపీ 39 డబ్ల్యూ 6610 ఐచర్ వాహనం లో సుమారు 160 బస్తాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని  (పీడీఎస్) తరలిస్తున్నారని, ఒక్కొక్క బస్తాలో  సుమారు 50 కేజీలు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని నంద్యాల పట్టణానికి చెందిన  నిజాముద్దీన్ అను వ్యక్తికి అధిక ధరకు అమ్మడానికి ప్రభుత్వ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య తన సహచర సిబ్బందితో అప్రమత్తమై  ఐచర్ వ్యాను ఏపీ 39 డబ్ల్యూ 6610 ను తనిఖీ చేసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: