యూపీలో మళ్లీ పేర్ల మార్పు పంచాయతీ

తొలినుంచి ముస్లిం పేర్ల మార్పుతో  వివాదాలకు తెరలేపుతున్న యూపీలోని యోగి సర్కార్ తాజాగా మరో పేర్ల వివాదానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ముసాయిదా డీలిమిటేషన్ ఉత్తర్వులు కొత్త చిచ్చు రేపాయి. అందులో దాదాపు 12 వార్డులకు ముస్లిం పేర్లను మార్చారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గోరఖ్‌పూర్ డీలిమిటేషన్ కసరత్తులో భాగంగా వార్డుల సంఖ్య పెరిగింది. అలాగే పేర్లను కూడా మార్చారు. ఇది ఇప్పుడు పెద్ద దుమారం రేగింది. దీని ప్రకారం ఇకపై 80 వార్డులు ఉంటాయి. గోరఖ్‌పూర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం.

అయితే ఈ గోరఖ్‌పూర్‌లో కొత్తగా వార్డుల పేర్లను దేశానికి సంబంధించిన ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుల పేర్లు కూడా పెట్టారు. ఆ ఉత్తర్వుల్లో ఇలాహి బాగ్‌ని ఇప్పుడు బంధు సింగ్ నగర్‌గా, ఇస్మాయిల్‌పూర్‌ని.. సహబ్‌గంజ్‌గా, జాఫ్రా బజార్‌ను ఆత్మ రామ్ నగర్‌గా మార్చారు. వీటితోపాటు మియా బజార్, ముఫ్తీపూర్, అలీనగర్, తుర్క్‌మన్‌పూర్, ఇస్మాయిల్‌పూర్, రస్సోల్‌పూర్, హుమాయూన్‌పూర్ నార్త్, ఘోసీపూర్వ, దౌద్‌పూర్, జాఫ్రా బజార్, ఖాజీపూర్ ఖుర్ద్, చక్సా హుస్సేన్ పేర్లను కూడా మార్చారు.

ఇలా ప్రత్యేకంగా ముస్లిం వార్డుల పేర్లను మార్చారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మేయర్ సీతారాం జైస్వాల్ కొత్త పేర్లు అహంకారాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు.పేర్లు మార్చేందుకు డబ్బు వృథా చేశారని కాంగ్రెస్ నాయకుడు తలత్ అజీజ్ అన్నారు. దీంతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందన్నారు. దీనికి సంబంధించి ఆదివారం పార్టీ సమావేశం నిర్వహిస్తామని సమాజ్ వాదీ పార్టీలు అంటున్నారు. అయితే వార్డుల పేర్ల మార్పు విషయంలో అభ్యంతరాలను వారంలోపు అదనపు ప్రధాన కార్యదర్శికి పంపవచ్చు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత డీలిమిటేషన్‌కు ఆమోదం లభిస్తుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: