జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
ఎమ్మార్వోకు ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వినతిపత్రం
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
గడివేముల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపుమేరకు గడివేముల మండలంలో పనిచేస్తున్న విలేకరుల సమస్యలపై ఎమ్మార్వో శ్రీనివాసులుకు సత్యనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ,ఎల్ల సుబ్బయ్యలు మాట్లాడుతూ ప్రజలకు వారధిగా పనిచేసే విలేకరులకు ఆరోగ్య భీమా నిలిపివేయడానికి, ఇళ్ల స్థలాలు మరియు బస్ లో ప్రయాణం చేయడానికి అక్రిడేషన్లు మధ్యలో ఆపివేయడం, విలేకరులకు జీఎస్టీ సాకుగా చూపి నిలిపివేయడం శోచనీయం మనీ, విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన కమిటీని ఏర్పాటు చేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఎల్ల సుబ్బయ్య, ఇబ్రహీం, శ్రీధర్ బాబు, చెన్నయ్య,మస్తాన్, రసూల్, చంద్రబాబు గడివేముల మండలం విలేకరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి... ఎమ్మార్వోకు ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వినతిపత్రం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: