గంగా..జమున తెహిజీబ్ హైదరాబాద్ లో..మత కేసులు కూడా ఎక్కువేనటా
హైదరాబాద్ అంటే అందరూ గంగా. జమున తెహిజిబ్ అంటారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా మతం, జాతి, ప్రాంతీయతకు సంబంధించి దేశం మొత్తమ్మీద అత్యధిక కేసులు నమోదైంది హైదరాబాద్ నగరంలోనే అని తాజాగా వెల్లడైంది. హైదరాబాదులో అత్యధిక సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడో ఏడాది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2021 నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. మొత్తం 19 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
ఐపీసీ సెక్షన్ 153ఏ కింద 2021లో హైదరాబాదులో 28 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 17, కోయంబత్తూరులో 14, నమోదయ్యాయి. 2021లో మొత్తం 19 నగరాల్లో 121 కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాదులోనే అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే, 2020తో పోల్చితే కేసుల నమోదులో 44 శాతం తగ్గుదల కనిపించింది.
అంతేకాదు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాదులో అల్లర్లు కూడా తక్కువేనని వెల్లడైంది. ఇక, రాష్ట్రాల విషయానికొస్తే... 2021లో తెలంగాణ వ్యాప్తంగా అల్లర్లకు సంబంధించి 562 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికం భూవివాదాలు, రాజకీయ అంశాలు, మతపరమైన అంశాలు, ఆర్థిక వివాదాలు, తదితర అంశాలకు సంబంధించినవే ఉన్నాయి. అటు, హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ కేసులు కూడా మరింత పెరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. 2020లో హైదరాబాదులో 1,379 సైబర్ కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 5,646కి పెరిగింది.
Home
Unlabelled
గంగా..జమున తెహిజీబ్ హైదరాబాద్ లో..మత కేసులు కూడా ఎక్కువేనటా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: