విద్యా వ్యవస్ధలో పెను విప్లవం...

జగనన్న విద్యా దీవెన పథకం 

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో విడత సొమ్ము జమ

దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల విడుదల

విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు

అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు,,ఇలా

మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు

మాజీ మంత్రి శిద్దా  రాఘవరావు వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

విద్యా వ్యవస్ధలో పెను విప్లవం..జగనన్న విద్యా దీవెన పథకమని మాజీ మంత్రి శిద్దా  రాఘవరావు వెల్లడించారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల విడుదలచేసి రెండో విడతగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు ఈ పథకాల కింద దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంకా శిద్దా  రాఘవరావు మాట్లాడుతూ... నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి సకాలంలో ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను సీఎం  వైఎస్ జగన్ జమ చేశారు.. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.

  వైఎస్ జగన్ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన – నాలుగు విడతలు, మొదటి విడత – ఏప్రిల్ 19, రెండవ విడత – జులై 29, మూడవ విడత – డిసెంబర్, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022. లబ్దిదారులు – 1,62,75,373, లబ్ది (రూ. కోట్లలో) – 26,677.82. విద్యారంగంపై ఇప్పటివరకు చేసిన ఖర్చు ఈ రూ. 26,677.82 కోట్లే కాకుండా నాడు – నేడు పథకం క్రింద ప్రీప్రైమరీ స్కూళ్ళుగా మారబోతున్న అంగన్వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ. 1,800 కోట్ల వ్యయం కూడా చేస్తుంది  వైఎస్ జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి చెబుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,774.60 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 4,207.85 కోట్లు జమ. ఈ ఏడాది ఏ బకాయిలకు తావులేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను పెంచి ఏప్రిల్లో మొదటి విడతగా రూ. 671.45 కోట్లు, నేడు రెండో విడతగా దాదాపు రూ. 693.81 కోట్లతో కలిపి ఇప్పటివరకు నేరుగా అందించిన మొత్తం రూ. 5,573.21 కోట్లు.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన – మొదటి విడత – ఏప్రిల్ 28, రెండో విడత – డిసెంబర్ లో. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: