మీ సేవా కేంద్రాల వద్ద కిక్కురిస్తున్న జనం
ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ తప్పనిసరికావడంతో
కోవిడ్ నిబంధనలు కనిపించని వైనం
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మీ సేవా కేంద్రాలు కిటకిటలాడాయి. ఉదయం ఐదు గంటల నుండి మీ సేవ కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు ప్రజలు. 45 సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ను లింక్ చేయడం తప్పని సరిచేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. మండల కేంద్రమైన గడివేముల లో ఒకటే మీ సేవ కేంద్రం ఉండడంతో ప్రజలు చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలు గుమ్మిగూడుతున్నారు. దీంతో జనసమూహం పెరగడంతో గడివేములలో రోడ్డున పోయే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.
ఈ మీ సేవా కేంద్రాల వద్ద జనం భారీగా రావడంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోంది. ప్రజల్లో ఆ తరహా భయం కూడా కనిపిపించని పరిస్థితి. అక్కడికి వచ్చిన ప్రజల్లో మెజార్టీగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటిస్తూ క్యూ నిబంధనలు పాటించకపోవడం వంటి ఘటనలు నెలకొంటున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం గానీ పోలీసు యంత్రాంగం గాపీ పెద్దగా శ్రద్ద పెట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: