సావిత్రి భాయి పూలే కలను సాకారం చేసిన షేక్ కుటుంబం

అట్టడుగు వర్గాల అక్షరం కోసం...నడుంకట్టిన సావిత్రి భాయి పూలే

సావిత్రి భాయి పూలేకు తోడుగా...అక్షర ఉద్యమంలో ఫాతిమా షేక్ 

సావిత్రి భాయి పూలేతో ఫాతిమా షేక్

భిన్నత్వంలో ఏకత్వం నా భారతదేశ గొప్పతనం..అందుకు ఎన్నో ఘటనలు మనముందున్నాయి. సమాజ మార్పు కోసం సాగిన ప్రతి ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు దేశంలోని తమ సోదరవర్గాలతో కలసి ఈ దేశంలోని ముస్లిం సోదరులు కలసి నడిచారు. అలాంటి ఎన్నో ఘటనలు మనకు చరిత్రను తిరిగేస్తే బోధపడుతుంది. అలాంటి గర్వపడే ఓ చరిత్ర మీకోసం. సాంప్రదాయం పేరుతో నాడు మన దేశంలోని కొన్ని శక్తులు అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు, స్త్రీలకు విద్యను దూరం చేశాయి. కానీ విద్యతోనే ఏ వర్గమైనా, సమూహమైనా పురోగతి సాధిస్తుందని నమ్మినవారు పూలే దంపతులు. అందుకే మహాత్మ జ్యోతిరావు పూలే స్వయంగా తన భార్య సావిత్రి భాయి పూలేకు విద్యను నేర్పారు. ఆమెను విద్యావంతురాలిగా తీర్చిద్దారు. ఆమె తను నేర్చుకొన్న విద్యా జ్ఞానాన్ని తన ఒకరికి పరిమితం చేయలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరువేయాలని నిశ్చయించారు. ప్రతి ఒక్కరికి విద్యా జ్ఞానం ఉండాలి...అలా విద్య జ్ఞానం ఉన్న వారు తమ జ్ఞానాన్ని పదిమందికి పంచాలని ఇస్లాం నిర్దేశం చేసింది.

ఇస్లాం చేసిన ఆ నిర్దేశం ప్రకారమే నాడు అట్టడుగు. బలహీన వర్గాలకు, స్త్రీలకు విద్యా జ్ఞానం అందించేందుకు బయలు దేరిన సావిత్రి భావియి పూలేకు ఫాతిమా షేక్ తోడయ్యారు. అట్టడుగు వర్గాలకు విద్యను అందించాలన్న సావిత్రి భాయి పూలే కలను సాకారం చేసేందుకు నాడు ఉస్మాన్ షేక్ నివాసమే ఓ బడిగా మారింది. తమ నివాసాన్ని ఉస్మాన్ షేక్ అట్టడుగు, బలహీనవర్గాల, స్త్రీల విద్య కోసం నాడు సావిత్రి భాయి పూలేకు ఇచ్చారు. అంతేకాకుండా నాడు సావిత్రి భాయి పూలేతోపాటు అట్టడుగు వర్గాలకు, స్త్రీలకు విద్యను బోధించేందుకు ఫాతిమా షేక్ కూడా నడుంకట్టారు. సావిత్రి భాయితో కలసి బలహీనవర్గాల విద్య కోసం సాగిన అక్షర ఉద్యమంలో ఫాతిమా షేక్ భాగస్వాములయ్యారు.

సావిత్రి భాయి ఫులే...ఫాతిమా షేక్ -1848 లో తోలి స్త్రీ విద్యాలయ స్థాపకులు

భారత దేశం లో మొదటి బాలికల విద్యాలయాన్ని 1848 లో పూణే నగరములో ఉస్మాన్ షేక్ నివాసం లో నెలకొల్పిన వారు సావిత్రి భాయి పూలే, ఫాతిమా షేక్. ఆ రోజులలో సంప్రదాయవాదులు స్త్రీలు ముఖ్యంగా అంటరాని కులాలకు చెందిన వారు  విద్య నేర్చుకోవటం పాపం అని భావించే వారు. తమ ప్రాణాలను, మర్యాదను పణంగా పెట్టి అగ్ర వర్ణాల ఆలోచలనలకు వ్యతిరేకంగా  సావిత్రి భాయి ఫూలే....ఫాతిమా షేక్ బాలికా విద్యాలయాన్ని స్థాపించారు. సావిత్రి భాయి1831 లో మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో జన్మించారు. తన 9ఏట 1840 లో ఆమె వివాహం జ్యోతి రావు పూలే తో జరిగింది. మియా షేక్ చెల్లెలు ఫాతిమా షేక్ 18వ శతాబ్దం లో ముస్లిమ్స్ లో మొదటి ఉపాద్యాయురాలు.

ఫాతిమా షేక్ పేరిటా లైబ్రరీ

 నిమ్నవర్గాల, వెనుకబడిన, దళిత ఆడపిల్లల కు విద్యాభోధన చేయడం అగ్రవర్ణాల వారు సహించే వారు కాదు. సావిత్రి భాయి పూలే పై  అశుద్ధం, పశువుల పేడ చల్లేవారు. రాళ్ళు విసేరేవారు. దానితోస్కూల్ కు వెళ్ళేటప్పుడు సావిత్రి భాయి పూలే  తన వెంట ఒక జత బట్టలను అదనంగా తీసుకు వెళ్ళేవారు.  నిమ్న వర్గాల, శుద్ర వర్గాల బాలికలకు విద్య నేర్పించాలనే ఆమె చిత్తశుద్ది ముందు ఇతరులు చేసే దుష్ట కార్యక్రమాలన్నీ ఒడిపోయాయి. వర్ణ వ్యవస్థ, కుల అహంకారం అధికంగా ఉన్న ఆ నాటి సమాజంలో సాంఘిక సమానత్వం సాధన, స్త్రీ విద్య వ్యాప్తి కోసం సావిత్రి భాయి పూలే  చేస్తున్న కార్యక్రమాలలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ సహకారం అందించారు. అగ్రవర్ణాల వారు సావిత్రి భాయి పూలే కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆఖరకు ఆమెను హత్య చేయడానికి కూడా పన్నాగం పన్నారు. సావిత్రి భాయి తన భర్త అడుగుజాడలలో నడిచి శూద్రుల  ముఖ్యంగా స్త్రీ విద్యా వికాసంనకు కృషి చేశారు. దళితుల, నిమ్న వర్గాల  అభ్యున్నతి వారి విద్యవికాసం పై ఆధార పడి ఉన్నాదని సావిత్రి భాయి విశ్వసించారు.

దేశం లో కెల్లా మొదటి బాలికా విద్యాలయము పూణే నగరంలో 1848వ సంవత్సరములో షేక్ నివాసములో ఫాతిమా షేక్, సావిత్రి భాయి ఫూలే స్థాపించారు. వారితో పాటు సావిత్రి భాయి ఆడపడుచు సుగుణా భాయి కూడా బాలికా విద్యాలయములో బాలికలకు విద్య నేర్పేవారు. 1818 మరాటా సామ్రాజ్యం అంతమైన తరువాత బ్రిటిష్ వారి పాలనా మరాఠా ప్రాంతం లో సుస్థిరమైనది. ఆ కాలంలో జ్యోతి రావు ఫూలే ప్రముఖ సామాజిక సంస్కర్త గా పేరుగాంచారు. జ్యోతి రావు పూలే శుద్రులు వెనుకబడి ఉండుటకు వారిలో అక్షరాస్యతలోపం ప్రధాన కారణం గా భావించి శూద్రుల  విద్యావికాసమునకు కృషి చేశారు. జ్యోతి రావు పూలే స్త్రీ విద్యను ప్రోత్సహించి, వితంతు వివాహాన్ని ప్రోత్సహించారు.  బాల్య వివాహం, సతి ఆచారం వ్యతిరేకించారు. అనాధులకు, పేద పిల్లలకు  శరణాలయాలు, స్త్రీలకు విద్యనూ బోధించే కార్యక్రమాలు ప్రారంభించారు. జ్యోతి రావు ఫూలే అభిప్రాయం లో మన దేశం లో ఆంగ్ల విద్య సంస్కరణ కార్యక్రమమునకు ఎంతోగా ఊతం ఇచ్చినది. దానికి తోడూ ఫూలే అనేక మంది ముస్లిం మిత్రులతో తన స్నేహం కొనసాగించారు. తన కాలం లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సాంప్రదాయ సమాజ వ్యవస్థ కు వ్యతిరేకంగా జ్యోతి రావు ఫూలే పోరాడారు. భారత దేశం లో కులవ్యవస్థకు, వర్ణ వివక్షణ కు వ్యతిరేకంగా నిమ్న, బలహీన వర్గాల ముఖ్యంగా స్త్రీ  విద్యసాధనకు పోరాడిన వ్యక్తి జ్యోతి  రావు పూలే. జ్యోతి రావు పూలే సత్య శోధక సమాజం ను స్థాపించారు. అతని రచనలలో “గూలంగిరి” అతి ప్రముఖమైనది.

ఫూలే దంపతులు యశ్వంత్ అనే బాలుడిని దత్తత తిసుకొన్నారు. అలా వారు దత్తత తీసుకొన్న పిల్లాడు ఉన్నత చదువుల చదివి డాక్టర్ విద్యను అభ్యసించారు.  1876-77 లో క్షామము ఏర్పడినప్పుడు అనాధ శరణాలయము లోని 200 బాలకులను సావిత్రి భాయి స్వయముగా కన్నబిడ్డల వలే వారిని చూసుకొన్నారు.  వారి దత్త పుత్రుడు యస్వంత్ సాయంతో ఆ రోగుల ఆరోగ్య సేవాసదుపాయాలు కల్పించారు. భారత దేశం కలకాలం గుర్తుంచుకోవలసిన వ్యక్తులు స్త్రీ విద్య రంగం లో విశేష కృషి చేసిన సావిత్రి భాయి పూలే, ఫాతిమా షేక్ వారి త్యాగం, శ్రద్ద, స్త్రీ విద్య  పట్ల వారి అంకిత భావం భారతీయ మహిళలకు మార్గదర్శకం.

✍️ రచయిత-పర్వీన్ సుల్తానా

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: