తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ మనతోనే ఉంటారు
టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ఆనంద్
(దోమకొండ శేషుబాబు - జానోజాగో వెబ్ న్యూస్, హైదరాబాద్)
ప్రఖ్యాత నటులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ఆనంద్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఆనంద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపింప జేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన లేనిలోటు కనిపిస్తుందని, ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అన్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది ? సినీరంగంలో రారాజుగా ఎదిగిన అయన.. అటు రాజకీయ రంగంలో కూడా సత్తా చాటారు. నేడు యన్.టి.రామారావు 25 వర్థంతిని పురష్కరించుకుని ఆయన మాట్లాడుతూ .. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి, తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహా వ్యక్తి నందమూరి తారకరామా రావు గారు. సినిమా రంగంలో నటుడిగా ఎవరు చేయలేనన్నీ రకాల పాత్రలు పోషించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపారు. అయన పోషించిన పాత్రలు చరితాత్మకం. అయన నేటి తరాలకు డిక్షనరీ గాను, ఎన్సైక్లోపీడియాగా చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్ గారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా దేవుడి పాత్రల్లో కనిపించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. సినిమాల్లో ఉంటూనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసి, నేను తెలుగు బిడ్డను అని తెలుగు దేశం అనే పార్టీని స్థాపించి.. కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన మహా వ్యక్తి అయన. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ..ప్రాంతాలు వేరైన, కుల, మతాలకు అతీతంగా అందరిని సమభావంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అయన ముందుకు కదిలారు. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏంతో సేవా చేసారు. తెలుగోడి దమ్ము, దైర్యం, సాహసం .. అయన ప్రత్యర్థులను గడగడలాడించిన దైర్యం ఉన్న నాయకుడు నందమూరి తారకరామారావు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో పాటుపడిన వ్యక్తి అయన. తెలుగు బాషా, తెలుగు ఆత్మగౌరవాన్ని భారతీయ శిఖరాలపై రెపరెపలాడించిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకులూ తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంతకాలం అయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, వారు బౌతికంగా మన మధ్య లేకపోయినా అయన ఎప్పటికి మనతోనే ఉంటారని, అభిమానులకు, కుటుంబ సబ్యులకు , తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు దేశం అభిమానులకు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు తల్లి!! ..జై తెలుగు దేశం !! .. జోహార్ ఎన్టీఆర్ !! అన్నారు.
Post A Comment:
0 comments: