విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి
శారాజిపేట లో ఎస్ అండ్ పీ సంస్థ అధిపతి వేణుగోపాల్ రెడ్డి
గ్రంథాలయానికి లక్ష విలువ చేసే పుస్తకాలు, మెటీరియల్ అందజేత
అందరూ విద్యావంతులు కాగలిగినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందగలదని వేణు గోపాల్ రెడ్డి అన్నారు. పుస్తకాలు విజ్ఞానాన్ని అందించి, అభివృద్ధికి దిక్సూచి గా దోహదం చేస్తాయన్నారు. మంచి పుస్తకాలు స్నేహితులతో సమానమన్నారు. ఓర్పు, సహనం, పట్టుదల, ఏకాగ్రతే అస్త్రాలుగా, విజయం వైపు సాగిపోవాలన్నారు. శారాజి పేట లో జరిగిన కార్యక్రమం లో సర్పంచ్ బండ పద్మ పర్వతాలు, ఎంపీటీసీ బత్తుల నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ కంతిమహేందర్,బండి పరమేష్, శివకుమార్, జనహిత సేవా సమితి అధ్యక్షులు బుర్ర శ్రీధర్, కొత్తోజు నాగరాజు, ఖుర్షీద్ పాషా, బత్తుల సురేంధేర్ రెడ్డి, సోమరాజు, వెంకటేష్ తదితరులున్నారు.
Post A Comment:
0 comments: