రైతులకు మద్దతుగా...
మేకవారిపల్లె టోల్ ప్లాజా వద్ద నిరసన
సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల ఆందోళన
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ఢిల్లీలో జరుగుతున్న రైతు దీక్షలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుపుతూ రాష్ట్ర పిలుపుమేరకు రాష్ట్రంలోని టోల్గేట్ల ముందు నిరసన దీక్షలు లో భాగంగా శనివారంనాడు ప్రకాశం జిల్లా తర్లుపాడు నందు సి.పి.ఐ, సిపిఎం ,రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. తర్లుపాడు మండలం మేకవారిపల్లె టోల్ ప్లాజా వద్ద నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు నాయకులు, మరియు సిపిఐ, సిపిఎం, సిఐటియు, నాయకులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో డి.కే.ఎం. రఫీ, సోమయ్య, రూబెన్,అందే నాసరయ్య,రాజు,సురేష్, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: