వేధింపులకు గురిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోండి
ప్రజా సంఘాల డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాల నందు ఫిజిక్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి సరస్వతి పై వేధింపులకు గురిచేస్తున్న ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ ఆర్జేడీకి ప్రజా సంఘాలు వినతి పత్రం సమర్పించాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈమె గత 20సంవత్సరాలుగా ఫిజిక్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోందనీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నదున ఈమెపై ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ,పలుమార్లు కులం పేరుతో దూషిస్తున్నాడని ఈమె మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇది వరకే ఈ మీకు రావాల్సిన 2 ఇంక్రిమెంట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రమోషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే విశాఖపట్నం ఉన్నతాధికారులకు సమర్పించాల్సిన పత్రాలు సకాలంలో పూర్తి చేసి ని విధించకుండా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని ఇతని మీద ఎస్సీ ఎస్స్తి అట్రాసిటీ కేసు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హిందూపురం తాలూకా అధ్యక్షులు సతీష్ కుమార్,బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఎం శ్రీరాములు, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: