పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
రైతులకు బాసటగా ఉంటానని హామీ
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
నివర్ తుఫాన్ కారణంగా ఆ కాలంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటపొలాలను మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, మండలంలోని సీత నాగులవరం గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులు అందరూ వి ఏ ఏ ల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నీవర్ తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో అధికంగా పంటలు నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులను అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం వ్యవసాయ అధికారి కె. చంద్రశేఖర రావును మండలంలోని అన్ని గ్రామాలలో దెబ్బతిన్న పంట పొలాలను అంచనా వేయాలని సూచించారు. అంచనా వేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే, పంట నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కల్లా లలో ఆరబోసిన మిరప కాయలను పరిశీలించారు. అకాల వర్షం కారణంగా తడిసిన మిరపకాయల వల్ల చాలా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈయన వెంట వ్యవసాయ అధికారి కె. చంద్రశేఖర రావు తర్లుపాడు మాజీ సర్పంచ్ సూరెడ్డి. సుబ్బారెడ్డి, వి ఏ ఏ లు, పార్టీ నాయకులు ఉన్నారు.
Post A Comment:
0 comments: