నోముల నర్సింహయ్య మృతి

(జానోజాగో వెబ్ న్యూస్-నాగార్జునసాగర్)

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1999, 2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల ఆ తరువాత 2009 భువనగిరి ఎంపీగా సీపీఎం తరఫున పోటీచేసి ఓటమిచెందారు. ఆ తరువాత 2013 లో టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై పోటీచేసి ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: