మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిలిపివేసిన పథకాలను తిరిగి ప్రారంభించండి
నంద్యాల జిల్లా ముస్లింహక్కుల పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి యూనుస్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను తిరిగి ప్రారంభించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యూత్ యూనస్,రాష్ట్ర నాయకులు షేక్ యూనిస్, నంద్యాల జిల్లా అధ్యక్షులు హయ్యద్ గులాంబాషా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ నిరుద్యోగ యువకులకు బ్యాంకు ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గతంలో నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు మరియు డ్రైవర్లకు కార్లు ఇచ్చేవారని, పథకాలన్నిటినివైఎస్ఆర్సిపి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, జగన్మోహన్ రెడ్డి కేవలం నవరత్నాలు పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేపట్టే పథకాలను రద్దు చేయడం జరిగిందని, గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ల ద్వారాఎలాంటి రుణాలు బలహీనవర్గాలకు అందించలేదని, అందరికీ అందించే నవరత్నాలు ద్వారా అందరి అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి ఆశించడం సరికాదని, నిరుపేదమైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారని,వారు సొంతంగా షాపులను పెట్టుకొని వ్యాపారం చేయాలంటే వారికి 10000/-,15000/-ల వరకుఖర్చుఅవుతుందని,గత ప్రభుత్వాలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో లింకేజీ రుణాలు ఇప్పించారని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ ఇచ్చేదని దీని ద్వారా అనేకమంది వ్యాపార రంగంలో స్థిరపడ్డారని, ఇప్పటికైనావైసిపిప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లను పునర్జీవింపజేసి వీటి ద్వారా గతంలో అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలని,ముస్లిం యువకులు ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అలాంటి వారిని ఆదుకోవాలంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిలిపివేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిలిపివేసిన పథకాలను తిరిగి ప్రారంభించండి......
నంద్యాల జిల్లా ముస్లింహక్కుల పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి యూనుస్
Post A Comment:
0 comments: