చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించండి..... జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్.

 చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించండి

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత రైతులను ప్రోత్సహించారు.స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీహాల్ ఆవరణలో చిరుధాన్యాల విక్రయ ఉత్పత్తులను జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి లు పరిశీలించారు. మిల్లెట్ సంవత్సర సందర్భంగా జిల్లాలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణస్థాయిని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రైతులను ప్రోత్సహించాలని,


వర్షభావ పరిస్థితుల్లో  కూడా చిరుధాన్యాల ఉత్పత్తులు బాగా వస్తాయని డిఆర్డిఎ, రైతుసాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంట ఉత్పత్తుల, తినుబండారాల స్టాళ్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: