ప్రజల్లో సానుభూతి కోసమే.....చట్టానికి ఎవరూ అతీతులుకాదు.... ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి

 ప్రజల్లో సానుభూతి కోసమే.....చట్టానికి ఎవరూ అతీతులుకాదు

ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేందుకు నంద్యాలకు వచ్చిన సీఐడీ అధికారుల ముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడిన నాటకాలు అంతా ఇంతాకావని, ఆడినాటకాలు ఇక నుండైనా కట్టిపెట్టాలని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిరూపితం అయ్యిందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించే క్రమంలో అధికారులు చంద్రబాబును హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తామని చెప్పినా ససేమిరా అంటూ రోడ్డు మార్గంలోనే వస్తానని చంద్రబాబుపట్టుబట్టడంలో అంతర్యం గ్రహించాలని, చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి వస్తుందన్న దురుద్ధేశంతో చేసిన పన్నాగం అని, ఆయన అవినీతి, అక్రమాల గురించి తెలిసిన ప్రజలు ఎక్కడా చంద్రబాబు అరెస్ట్ను అడ్డుకొనే ప్రయత్రం చేయలేదని నంద్యాల పద్మావతినగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పాచక్రపాణిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూట్ కేసు కంపెనీలను సృష్టించి 371కోట్ల ప్రజాధనాన్నిదోచుకోన్నారని,


ఈ కేసులో సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసేందుకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన నాటకాలు ఎంతగానో రక్తికట్టించాయని ఎద్దేవాచేశారు. ఇలాంటి నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని, నాడు ఓటుకు నోటుకేసులో తప్పించుకొనిదాక్కున్నాడని, పత్తికొండలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తనతో బస్సులో చంద్రబాబు బేరసారాలు ఆడాడని దానికి తానే సాక్ష్యమని, చంద్రబాబు రిమాండుకు నిరసనగా రాష్ట్రంలో బంద్ కు పిలుపునిస్తే ఎక్కడా బంద్ జరిగిన దాఖలాలు కనిపించలేదని, అవినీతి చేసి బంద్ లు చేయడం ఎంతవరకు సమంజసమో టీడీపీ నేతలు చెప్పాలని, అమరావతి రాజధాని నిర్మాణంలో కోట్లాది రూపాయలను దోచుకొన్నారని, అనేక కేసుల్లో విచారణ జరుపకుండా కాలయాపన చేస్తూ న్యాయస్థానాల్లో స్టేలు తీసుకురావడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని,అన్నీ కేసుల్లో విచారణ జరపాల్సిందేనని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, రానున్న రోజుల్లో వాస్తవాలువెలికివస్తాయని, చట్టం తనపనితాను చేసుకుపోతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న దానిలో వాస్తవం లేదని, ఆయన చేసినఅవినీతి, అక్రమాలతోనే జైలుకు వెళ్ళాడన్నది బహిరంగ రహస్యమని, ఇకచంద్రబాబునాయుడి పని అయిపోయిందని, టీడీపీ నాయకుల పనికూడాఅయిపోయిందనితెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్సీపీసమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు తిరుపంరెడ్డి, బుగ్గారెడ్డి, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మోత్కూరు నాగేశ్వరరెడ్డి, ప్రవీణ్ తేజ, పుల్లయ్య, సుబ్బరామయ్య, పుల్లారెడ్డి, షభారెడ్డి, తదితర నాయకులుపాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: