గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో,,

టిప్పర్ గేటు(బండ్ల మెట్ట)వేలం పాట 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం లోని తమ్మరాజుపల్లి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీకి నిధుల కొరతతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎల్పిఓ రామ్ బాబు,పంచాయతీ సెక్రటరీ రాజ శేఖర్,గ్రామ సర్పంచ్ బత్తుల విజయ గౌరీ అధ్యక్షతన గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో టిప్పర్ గేటు(బండ్ల మెట్ట)వేలం పాట నిర్వహించారు.వేలం పాటలో పాల్గొన్న సభ్యులు 20,000/- రూపాయలు డిపాజిట్ చెల్లించి 18 మంది తమ్మరాజుపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డిఎల్పిఓ రామ్ బాబు, పంచాయతీ సెక్రటరీ రాజ శేఖర్,గ్రామ సర్పంచ్ బత్తుల విజయ గౌరీ అధ్యక్షతన నిర్వహించిన వేలం పాటలో గ్రామానికి చెందిన మండ్ల మధు 6,65,000-00/-వేలం పాటను దక్కించుకున్నందుకు హర్షిస్తున్నామని,


తమ్మరాజు పల్లె గ్రామ అభివృద్ధి పనులు గ్రామానికి జరుగుతాయని ఆశిస్తూన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు బత్తుల. శేషారెడ్డి, జగిలి. రామకృష్ణ, షేక్షావలి, బాలరాజు. కోడె. శేషయ్య, విద్యకమిటీ ఛైర్మెన్ మధు సూదన్ నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: