సచివాలయ కేంద్రాలలో ఆధార్ క్యాంపులు
గడివేముల ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ గడివేముల మండలంలో 22-08-23వ తేదీ నుండి ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప తెలిపారు. గడివేముల గ్రామంలో 22-08-23 వ తేదీన సచివాలయ కేంద్రంలో, 23-08-23 వ తేదీన చిందుకూరు సచివాలయ కేంద్రంలో 24-08-23 వ తేదీన బిలకలగూడూరు సచివాలయ కేంద్రంలో 25-08-23 వ తేదీన మంచాలకట్ట సచివాలయ కేంద్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, మండలంలోని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడివేముల మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వరప్ప తెలిపారు.
Post A Comment:
0 comments: