అభివృద్ధి వైపు జల్ పల్లి పరుగులు

సబితమ్మ విజన్ తో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ....సుమారు 6 కోట్ల పై చిలుకు నిధులతో  చేపట్టబోయే పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీరామ్ కాలానికి సంభందించి 18 వ వార్డులో   80 లక్షలతో,వార్డు నెంబర్ 19  లో 80 లక్షలతో,17 వ వార్డులో 41 లక్షలతో,20 వ వార్డులో  80 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేసారు.20 వ వార్డులొనే సబితా ఇంద్రారెడ్డి


కాలనిలో 36.65 లక్షలతో,నిత్యా ఎనక్లేవ్ లో 24.50 లక్షలతో మంచినీటి సరఫరా ను ప్రారంభించారు.అదేవిధంగా వాదే హుడా 23 వ వార్డులో 80 లక్షలతో,వాదే ముస్తఫా వార్డు  నెంబర్ 22లో 80 లక్షలతో,వార్డు నెంబర్ 21లో 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్,  మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో మహేశ్వరం నియోజకవర్గ కార్పొరేషన్లు,  మునిసిపాలిటీ లలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  ఇటీవలి మహేశ్వరం పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కార్పొరేషన్లకు 50 కోట్ల చొప్పున 100 కోట్లు, రెండు మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున 50 కోట్ల నిధులు కేటాయిస్తూ వరాల జల్లులు కురిపించారని,  వీటితో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.  రూ. 168 కోట్లతో పాటు, మెడికల్ కళాశాల, సబ్ స్టేషన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  అభివృద్ధి-సంక్షేమాలు మా నినాదాలు - విధానాలని మంత్రి పేర్కొన్నారు.


అదేవిధంగా అన్ని చోట్ల సమీకృతా మార్కెట్ లు, వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు,కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 40 కోట్ల నిధులతో 10 చెరువులను సుందరికరణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జల్ పల్లి మునిసిపాలిటీ లో అంతకుముందు 56 పనులకు 22 కోట్ల 40 లక్షలు, నిధులు మంజూరు అయ్యాయని వీటితో సీసీ,బీటీ రోడ్లతో పాటు పలు చోట్ల రోడ్ల వెడల్పు పనులు  మొత్తం 132 పనులకు గాను 43.585 కోట్ల వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు.  100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో నాళాలు, తాగునీటి సమస్య లకు శాశ్వత పరిష్కారం కోసం 320 కోట్లతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.  రూ.110 కోట్లతో  నాళాల పనులు జరుగుతున్నాయన్నారు.  తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామన్నారు. మిషన్ భగీరథ  ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరిందన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్,  మీర్ పేట్,  జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

గృహ లక్ష్మి పథకం కింద స్వంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవటానికి 3 లక్షలు ఇవ్వనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నోటరీ ఇళ్లకు క్రమబద్ధీకరణ అవకాశం ఉందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.  పహాడి షరీఫ్ పాఠాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మిగిలిన దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు ఇటీవలే 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్  9 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఊహాలకందని అభివృద్ధి జరిగిందని,24 గంటల విద్యుత్ లాంటి మైలు రాళ్లు అందుకుందన్నారు.75 వేల కోట్లు రైతన్నల ఖాతాలో వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.సంక్షేమంలోను రాష్టం మేటిగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గంలో  పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్న పరిశ్రమలతో భారీగా పెట్టుబడులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.

















Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: