పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన....

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపిఎస్) 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి (ఐపిఎస్) పాణ్యం నియోజకవర్గం లోని గడివేముల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని,స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించిన అనంతరం స్టేషన్ లోని పలు కేసులపై విచారించి పెండింగ్ లో ఉన్న కేసులపై విచారణ త్వరగా చేపట్టి దర్యాప్తు ముగించి కోర్ట్ నందు చార్జిషీటు దాఖలు చేయాలని,మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులకు న్యాయం చేయాలని, మండల పరిధిలోని గ్రామాలలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని,రాత్రి సమయంలో గస్తిని పెంచాలని,పాత నేరస్తుల కదిలికలపై నిఘా ఉంచాలని,


అసాంఘిక కార్యక్రమాలైన జూదం, మట్కా,అక్రమ రేషన్ బియ్యం తరలింపు,నాటు సారాయి తయారీ, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని పూర్తిగా అరికట్టాలని,రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్యాక్షన్ పికెట్ పై ప్రత్యేక నీఘ ఉంచి గ్రామంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాచారం తెలుసుకొని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు,ఎ స్పీ సీసీ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: