ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో....
భారత మాజి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో భారత మాజీరాష్ట్రపతి, అణుశాస్త్రవేత్త, మిస్సైల్ మాన్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన
అనంతరం నడిగడ్డలోని స్థానిక మాస్టర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి శిబిరంలో దాదాపు 100 మందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి,బిపి,షుగర్ ఉచిత పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, తేలకపల్లి చైతన్య, నంద్యాల మండల సబ్ బ్రాంచ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ సోహెల్, డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: