కంటి సమస్యలపై వైద్య సలహా తప్పనిసరి

సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు కోరారు. గురువారం పురాని హవేలీ లోని సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జనహిత సేవా ట్రస్ట్  సహకారంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కే వేణుగోపాలరావు మాట్లాడుతూ


తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు ఇటువంటి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ పూర్ణచందర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహమూనా, డాక్టర్ రమ్యా ప్రియా, సరిత, సెట్విన్ సూపరింటెండెంట్ పెండ్యాల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: