నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మహిళను ఢీ కొట్టిన లారీ
తీవ్రంగా గాయపడిన మహిళా
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మహిళను లారీ ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయాలపాల్సంది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామానికి చెందిన జెల్ల నాగ లక్ష్మమ్మ,(60) గ్రామంలోని వడ్డే రామచంద్రుడు ఇంటి ముందర కొల్లాయి నీళ్లు పట్టుకొనుటకు బిందె తీసుకోని రోడ్డుకు ఎడమ వైపు నడుచుకుంటూ వెళ్ళు తుండగా జిందాల్ సిమెంట్ ఫాక్టరీ నుండి సిమెంట్ ని తీసుకెళుతున్న TN 31 BL 8754 నెంబర్ లారీ డ్రైవర్ ఏ.ఇలియరజా లారీని అతివేగంగా,
ఆజాగ్రత్తగా,హరన్ కొట్టకుండా నడుపుతూ జల్ల లక్ష్మీదేవిని ఢీకొట్టగా ఆమెకు రెండు కాళ్లు విరిగి తీవ్రరక్త స్రావం జరిగి నరాలు వెలడుతూ వున్నయని ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల హాస్పిటల్ కు తరలించామని, నంద్యాల హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని చిందుకూరు గ్రామానికి చెందిన బింగి నాగరాజు( 55) వచ్చి తెలిపిన వివరాల మేరకు గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Home
Unlabelled
నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మహిళను ఢీ కొట్టిన లారీ,,,, తీవ్రంగా గాయపడిన మహిళా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: