మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో

బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్.. బిజెపి నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపొందుకుంటున్నాయి. ఈ రోజు సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవ మల్లేష్, బిజెపి పార్టీకి చెందిన గూడ సురేష్ , దండుగుల హరీష్ బీ పార్టీలో చేరారు.  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుండె రాములు, మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీను , గ్రామ యూత్ అధ్యక్షుడు తడకల వినోద్  , గ్రామ మహిళా అధ్యక్షురాలు అలివేలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: