ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... దేశాన్ని రక్షిద్దాం

జిహెచ్ఎంసి సర్కిల్ 9 ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

 (జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానగర పాలక సంస్థ సర్కిల్ 9 ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం దేశాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఆయాబస్తీలు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించే సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: