లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మంహంకాళి ఆలయ బోనాలు,,,

ఢిల్లీ లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

లాల్ ధర్వాజ  సింహవాహిని శ్రీ మహాంకాళీ అమ్మవారిని  దర్శించుకున్న తెలంగాణా రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్ ముధిరాజ్ కు ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మెన్ పోసాని సురేందర్ ముదిరాజ్  శాలువ పూలమాలతో సత్కరించి ఆలయ మెమెంటోను బహూకరించారు. ఈ ఆషాడమాసంలో మన దేశ రాజధాని డిల్లీ నగరంలో లాల్ ధర్వాజ  సింహవాహిని శ్రీ మహాంకాళీ అమ్మవారి ఆలయం ఆధ్వర్యములో జరిగే  బోనాల  ఉత్సవాలను మన తెలంగాణా రాష్ట్రప్రభుత్వం తరఫున ఘనంగా జరుపడానికి  మన తెలంగాణా రాష్ట్రప్రభుత్వం తగిన యేర్పాట్లు చేయించగలరని ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మెన్లు పోసాని సురేందర్ ముదిరాజ్,


భద్రినాథ్ గౌడ్ , శివ కుమార్ యాదవ్, తేలంగాణా రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ను కోరారు.  దానికి బండ ప్రకాష్ ముదిరాజ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్కార్యక్రమంలో  ఆలయ మాజీ చైర్మెన్ జగదీష్ ముదిరాజ్, పోతురాజ్ బాబురావ్,   విష్ణు గౌడ్, మాజీ  చైర్మెన్ పోసాని విజయ్ కుమార్  సభ్యులు  సధానంద్ ముదిరాజ్, రంగ శ్రీకాంత్ గౌడ్, సుధాకర్,  జే. రమేష్, ఎస్ రమేశ్ బాబు, పి. గోపాల్, ఎం. మచ్చేందర్, ప్రభు, డి. శ్రీకాంత్, భరత్ అభినాశ్ , విట్టల్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: