అభివృద్ధి-సంక్షేమాలే 

మా నినాదాలు, విధానాలు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అభివృద్ధి-సంక్షేమాలే  మా నినాదాలు, విధానాలు అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బడంగ్ పేట్ ,మునిసిపల్ కార్పొరేషన్ పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ 10 వ డివిజన్లో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి-సంక్షేమాలే మా నినాదాలు, విధానాలు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: