ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి కన్నుమూత
సంతాపం ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ (92) మరణం పట్ల విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. శుక్రవారం నాడు మంత్రి సబితా రెడ్డి గారు ఎమ్మెల్యే స్వగ్రామం ఎలిమినేడులో పద్మమ్మ గారి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొన్నారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రితో
పాటు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ, డీసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు సత్తు వెంకటరమణ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.
Home
Unlabelled
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి కన్నుమూత ... సంతాపం ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: