సమిష్టి కృషితో అమిత్ షా సభను విజయవంతం చేద్దాం

బహిరంగ సభ సన్నాహక సమావేశంలో బిజెపి అగ్రనేతల పిలుపు

సమావేశానికి హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

పార్టీ నేతలంతా సమిష్టి కృషి చేసి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి అమిత్ షా భారీ భహిరంగ సభ" సన్నాహక సమావేశానికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబెర్-హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు.


చేవెళ్ల పార్లమెంటు పరిధిలో జరగనున్న అమిత్ షా భారీ భహిరంగ సభతో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో కాషాయ జెండా ఎగురవేస్తది అన్న రీతిలో ఈ సభ ఉండబోతున్నది కావున చేవెళ్ల పార్లిమెంట్ పరిధి నాయకులు ప్రతి ఒక్కరు సమిష్టిగా కష్ట పడి సభను విజయవంతం చేయాలనీ బిజెపి అగ్ర నాయకులు పిలుపునిచ్చారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: