భూసార నమూనాల సేకరణపై...

గడివేముల మండల స్థాయి శిక్షణ కార్యక్రమం....

వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల వ్యవసాయశాఖ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై,భూమిలో పోషకాల ఆవశ్యకత, భూసార పరీక్షల ప్రాముఖ్యత,సమస్యత్మక నేలలు (చవుడు) - బాగుచేయుట,సమగ్ర సమతుల ఎరువుల గురించి ఆర్బికే సిబ్బందికి గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్ రెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆర్బీకే సిబ్బందితో మాట్లాడుతూ రైతుల నుండి సేకరించిన మట్టి నమూనాలో కనుగొనబడే లక్షణాలు -  నేల రంగు, స్వభావము,రకము,రుచి, ఉదజని సూచిక,లవణ శాతము,సేంద్రియ కర్బనము మరియు ముఖ్య పోషకాలైన  నత్రజని,భాస్వరం, పొటాషియం పంటలకు ఎంత వరకు అందుతున్నాయో తెలుసుకొని రైతుసోదరులకు తెలుపవచ్చని,భూమిలో పోషకాలు తక్కువగా ఉన్నట్టయితే రైతులు 30% ఎరువులు అదనంగా పంటభూములకు


అందించవలసి ఉంటుందని,రైతు సోదరులందరూ ఆర్బికే సిబ్బందిని సంప్రదించి ప్రతి 5 ఏకరాలలో మట్టి నమూనాలను తమ పొలాలలో సేకరించి భూసార పరీక్షలు చేయించుకోని అధిక దిగుబడులు పొందాలని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: