గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా... 

గొల్లుర్ గ్రామ సర్పంచ్ మంద కవిత కుమార్ ఆధ్వర్యంలో 

బీఆర్ఎస్ నేతల పాదయాత్ర, ధర్నా... నిరసన

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం మండల్ గొల్లుర్ గ్రామంలో సర్పంచ్ మంద కవిత కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను  నిరసిస్తూ  గోల్లుర్ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా దగ్గర నుండి గ్రామంలో పాదయాత్ర తోపాటు ధర్నాచేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షుడు ఎన్.జీ. పవన్ చారీ, మండల పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ గౌడ్, వార్డ్ సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షుడు మంద కుమార్, ప్రవీణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు గోపీనాథ్ గౌడ్, పార్టీ కార్యదర్శి హరిశంకర్, ఉపాధ్యక్షుడు దార శివ కుమార్, కన్వీనర్ మంద సుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: