మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై ఒక అవగాహన వస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్ఫారం సంస్థ ఐన ఎక్స్ ప్లోర్.కో. ఇన్ (Xplore.co.in ).. గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, ఆధ్వర్యములో నిర్వహించబడు మాక్ ఎంసెట్ టెస్ట్ సిరీస్ కు సంబందించిన పోస్టర్ ను సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు
.విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ ఈ సిరీస్ లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్ కు హాజరు కానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి ప్రాక్టీస్ కొరకు వినియోగించుకొనవచ్చు నని తెలిపారు. పరీక్ష వ్రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలియబడుతాయని,
తద్వారా మెయిన్ పరీక్షలకు విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చునని తెలిపారు. సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ గారు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి ప్రమాణాలతో కూర్చబడినవి అని తెలిపారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tseamcet.xplore.co.in/ నందు నమోదు చేసుకొనవలసినదిగా కోరారు. మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5వ తేదీన ఉదయం 9 గం నుండి సాయంత్రం 5 గం వరకు https://tseamcet.xplore.co.in/ లో అందుబాటులో ఉంటుంది. తదుపరి మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25 మరియు 30 తేదీలలో నిర్వహించబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో Xplore company మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి కూడా పాల్గొన్నారు.
Home
Unlabelled
మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన,,, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: