అంగరంగ వైభవంగా...

శ్రీ మహంకాళేశ్వర దేవాలయం ఏడవ వార్షికోత్సవ వేడుకలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ నిర్వాహకులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మీరాలందుండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం ఏడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం నాడు దేవాలయం కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం మాతృక పూజనం, కాంది. ఆచార్య ఋత్విక్వర్థం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు జరిగాయి.  ఉదయం 8 గంటల నుంచి బ్రహ్మదిమండల స్థాననం నవగ్రహ దేవత స్థాదన పూలు, లక్ష్మీస్థావడం. రుద్రవీర స్థాపనం, ఆంజనేయ, సుబ్రమణ్య స్థావనం తదితర కార్యక్రమ కొనసాగాయి.


అగ్ని ప్రతిష్ట, రుద్ర హోమం, చండీ హోమం, మక్త్యాసత్త -నవగ్రహం హోమం మహా కుంభాభిషేకం పూర్ణాహుతి జరిగాయి. వేద పండితుల మంత్రోచరణాల నడుమ జరిగిన కార్యక్రమంలో దేవాలయం కమిటీ ఉపాధ్యక్షులు కాటా రమేష్ దంపతులతో పాటు కోటిరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: