ఖాదర్ ఖాన్ ది ప్రభుత్వ హత్య
ఆయన కుటుంబానికి రు.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి
బహుజన సమాజ్ పార్టీ డిమాండ్
మెదక్ జిల్లాలో ఇటీవల లాక్ అభ్యర్థులు మరణించిన ఖాదర్ ఖాన్ కోటి రూపాయలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఎస్పీ డిమాండ్ చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని విమర్శించింది. సోమవారం నాడు పాతబస్తీలో ఉండే ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను బీఎస్పీ పార్టీ నేతలు అబ్రహం హుస్సేన్, మౌలానా మసూదీ షఫీ, చాట్ల చిరంజీవి, మూల రామ్ చరణ్ దాస్ పరామర్శించారు. ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను అడిగి వాస్తవాలను సేకరించారు. అనంతరం వారు చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ...
ఖాదర్ ఖాన్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని వారు పేర్కొన్నారు. పోలీసు అధికారులను సస్పెన్స్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
Home
Unlabelled
ఖాదర్ ఖాన్ ది ప్రభుత్వ హత్య,,, ఆయన కుటుంబానికి రు.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి ,,,బహుజన సమాజ్ వాది పార్టీ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: