శంషాబాద్ కు ఈఎస్ఐసీ మంజూరు చేసి

సబ్ కా సాథ్...సబ్ కా వికాస్ అని ప్రధాని నరేంద్ర మోడీ రుజువుచేశారు

ఓట్ల కోసం హామీ ఇచ్చిన కేసీఆర్ మాత్రం గెలిచాక విస్మరించారు

ఈఎస్ఐసీ ఆసుపత్రి మంజూరు చేసినందుకు ప్రధానికి, కేంద్ర మంత్రి ధన్యవాదాలు

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ పట్టణానికి 100 పడకల ఈఎస్ఐసీ హాస్పిటల్ ను మంజూరు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మంత్రివర్యులు యాదవ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ....


సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక్క నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేదవారికి పెద్దన్న లాగా అండగా నిలుస్తున్నాని ఆయన కొనియాడారు. కేవలం ఓట్ల కోసం శంషాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తెస్తాం అని రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పటివరకు ఆ హామీ ఊసేత్తలేదని బుక్క వేణగోపాల్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి, మన తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీనే శ్రీరామ రక్షా అని రాష్ట్ర ప్రజలందరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు మంచి విద్య, ఉచిత వైద్యం అని ఆయన పేర్కొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: