పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో...

అన్నదాన కార్యక్రమం... పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అమావాస్యను పురస్కరించుకొని దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్పదని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీలో దేవాలయాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు దోరేటి ఆనందగుప్త, వెంకటాచల ముదిరాజ్ కట్టా నర్సింహారావు తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: