పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో...
అన్నదాన కార్యక్రమం... పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
అమావాస్యను పురస్కరించుకొని దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్పదని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీలో దేవాలయాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు దోరేటి ఆనందగుప్త, వెంకటాచల ముదిరాజ్ కట్టా నర్సింహారావు తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో... అన్నదాన కార్యక్రమం... పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: