రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి,,,
హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి బీజేపీ ముఖ్యనేతలతో కలసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. మంగళవారంనాడు కుంట్ల రామ్ రెడ్డి గార్డెన్స్ లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జెండా ఆవిష్కరణతోపాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. వీటిలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ హాజరయ్యారు.
వీరితోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా, ప్రేమ్ రాజ్, బిజెపి రూరల్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అంజన్ గౌడ్, తూళ్ల వీరేందర్ గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీరాములు యాదవ్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, లచ్చి రెడ్డి, కొత్త అశోక్ గౌడ్, అందే బాబాయ్య, జంగయ్య యాదవ్, బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నందాకిశోర్ గుప్తా, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, పాశం శ్రీధర్, బుక్క ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి,,, హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: