బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ చేయాలని డిమాండ్

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకొంది. బనగానపల్లె మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ వేధింపులతో దస్తగిరి మృతి చెందారని ఆయన బంధువులు ఆందోళన చేట్టారు. దస్తగిరి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా వారు అడ్డుకున్నారు. ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ లను విధుల నుండి తప్పించి, వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపేవరకు తాము మృతదేహానికి శవ పరీక్ష చేయించమని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు భీష్మించి కూర్చున్నారు.


దీంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకొని మృతుడి దస్తగిరి కుటుంబ సభ్యులతో,బంధువులతో మాట్లాడుతూ శవపరీక్ష చేయించాలని సూచించారు. మృతుని దస్తగిరి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉండి పోరాడుతానని హామీ ఇవ్వడంతో శివ పరీక్ష పంచనామను ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్వహించారు. ఉన్నత అధికారులు చొరవ చేసుకుని ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ లను విధుల నుంచి తొలగించి 
సస్పెండ్ చేయకపోతే కుటుంబ సభ్యులందరం పురుగుల మందు తాగడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మృతుని బంధువులు హెచ్చరించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: