చివరి మజిలీ యాత్రకు ఉచిత వైకుంఠ రథం

వైకుంఠ రథం ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జల్పల్లి  మున్సిపాలిటీలో సేవలు అందించేందుకు అందుబాటులోకి వైకుంఠ రథం 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి  మునిసిపాలిటీ నిధులు కింద రూ.17 లక్షల వ్యయం తో కూడిన వైకుంఠ రథం అందుబాటులోకి వచ్చింది. ఈ వాహనాన్ని వాహనాన్ని  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...నిరుపేదలకు తన చివరి మజిలీ  ఘట్టం సజావుగా సాగడానికి  చివరి మజిలీ యాత్రకు  జలపల్లి మున్సిపాలిటీ సేవల్లో వైకుంఠ రథం ఉచితంగా  ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా బీన్ అహ్మద్  సాధి, కమిషనర్ వసంత, సయ్యద్ యూసుఫ్ పటేల్ మరియు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: