ఈ సార్లు అంతా వెరీ బీజీ
మహాత్ముని వర్ధంతిని విస్మరించిన అధికార్లు
నివాళ్లులు నోచుకొని గాంధీజీ
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
మహాత్మాగాంధీ ఈ పేరు మన దేశంలోని కాదు దేశ, విదేశాలలో సైతం ఎంతోో సుపరిచితం. అంతే కాదు విదేశీయులచేత కూడా పూజింపబడుతున్న మహోన్నతుడు మన మహాత్మాగాంధీ. ఇక మనదేశానికి జాతిపిత ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి...వర్ధంతి రెండూ ఎంతో భక్తితో ప్రతి భారతీయుడు నిర్వహిస్తాడు. కానీ అందుకు భిన్నమైన వాతావరణం మన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో నెలకొంది. అక్కడి ప్రభుత్వ అధికార్లు అంతా పనుల్లో బీజీ అయ్యారటా...అందుకే అక్కడ తన వర్ధంతి సందర్బంగా మహాత్మాగాంధీ కనీసంనివాళిని కూడా నోచుకోలేదు. ఆయన విగ్రహానికి గానీ చిత్రపటానికి గానీ ఓ పూలమాల వేయలేదు. ఇది మన గడివేముల మండలంలోని అధికార్ల తీరు. ఈ సార్ల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అహింసా ఉద్యమంతో అందరి మనస్సులను చూరగొని బ్రిటీషర్లను వణికించిన ధీరుడు మహాత్మాగాంధీ. అలాంటి గాంధీకి ఆయన వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ అధికార్లు కనీసం నివాళ్లులర్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గడివేముల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్, సచివాలయాలలో గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతిపిత మహాత్మాగాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి గాని చిత్రపటానికి పూలమాల వేసి ఘటన ఎక్కడ చోటు చేసుకోలేదు. ఏ కార్యాలయంలోనూ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగినట్లు తెలియరాలేదు. కారణం వింటే వింతగా ఉంది. మండల పరిధిలో స్పందన కార్యక్రమం ఉన్నందున కొందరు అధికార్లు తాము బీజీ అని భావించారు. ఇంకోందరు ఏ కారణంతో చేయలేదో గానీ మొత్తంగా మహాత్మాగాంధీ వర్ధంతిని విస్మరించి అధికార్లు విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు.
Home
Unlabelled
ఈ సార్లు అంతా వెరీ బీజీ,,, మహాత్ముని వర్ధంతిని విస్మరించిన అధికార్లు,,, నివాళ్లులు నోచుకొని గాంధీజీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: