చట్టాన్ని ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ నరేష్ హెచ్చరిక

అర్థరాత్రి నిర్ణీత సమయం దాటాక వ్యాపారాలు నిర్వహించిన పలువురి అరెస్ట్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల కు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటక హోటల్లలో వ్యాపార కలాపాలు నడుపుతున్న వారిపై ఇన్ స్పెక్టర్ నరేష్ కేసు నమోదు చేశారు. అనంతరం శుక్రవారంనాడు అరెస్ట్ చేసిన వారిని కోర్టు ముందు ప్రవేశ పెట్టగా మొదటి ప్రత్యేక మెట్రోపోలిటన్ న్యాయమూర్తి విచారించి అబ్దుల్ ఖాలీద్(32) , మక్కా టిఫిన్ సెంటర్ యాజని పంచ్ మొహాల్లకు ఆరు రోజుల జైలు శిక్షతోపాటు రూ• 150/ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ హోటల్, ఇతర వ్యాపార సముదాయల వారు నిర్ణీత సమయంలోపు తమ వ్యాపార కార్యకలాపాలు  ముగించేయాలని సూచించారు. నిర్ణీత సమయం ముగిసిన తరువాత కూడా షాపులు, హోటల్లు, పాన్ డబ్బాలు, ఏ ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించవద్దని ఆయన సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఇన్ స్పెక్టర్ నరేష్ హెచ్చరించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: