నవనంది యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి 

ఆర్ ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఆకుమల్ల శ్రీధర్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక బనగానపల్లే పట్టణంలోని శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్  కళాశాలలో రెవన్యూషనరీ స్టూడెంట్ యూనియన్(ఆర్ ఎస్ యు) నంద్యాల జిల్లా మొదటి మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుమల్ల శ్రీధర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో నవనంది యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని,పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో ఇవ్వడంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై నూతన సంవత్సరం ముందే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు భీమేష్ మరియు లెక్చరర్స్ శ్రీకాంత్, సుధాకర్,రవికుమార్ పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: