వేములవాడ సెస్ ఎన్నికల కార్యకర్తల సభకు,,,వచ్బిన బండి సంజయ్ 

 శాలువ కప్పి బండి సంజయ్ ను సభకు ఆహ్వానించిన బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-వేములవాడ ప్రతినిధి)

వేములవాడ నియోజకవర్గ సెస్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన ప్రచారాన్ని మమ్మురం చేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తనదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే వేములవాడ నియోజకవర్గ సెస్ ఎన్నికలో బిజెపి బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా  బండి సంజయ్ ని వేములవాడ నియోజకవర్గ సెస్ ఎన్నికలో టౌన్-1 ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ శాలువాతో సన్మానించి సభకు ఆహ్వానించినారు. 


 





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: