ఎన్నికల ప్రచారంలో భాగంగా

శ్రీ రాజరాజేశ్వర స్వామి... భీమేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకొన్న బుక్క వేణుగోపాల్

నిర్వీరామంగా ప్రచారం సాగిస్తున్న బుక్క

(జానో జాగో వెబ్ న్యూస్-వేములవాడ ప్రతినిధి)

వేములవాడ టౌన్ 1 సెస్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ నిర్వీరామంగా ప్రకారం సాగిస్తున్నారు. ప్రతి ఓటరు ను ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే బుక్క వేణుగోపాల్ వేములవాడ టౌన్ 1 సెస్ ఎన్నికల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు ప్రచార పర్యటనలోొ భాగంగా బుక్క వేణుగోపాల్ "రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి మరియు భీమేశ్వర స్వామి వారి" దర్శనం చేసుకోన్నారు. వేములవాడ టౌన్ 1 సెస్ ఎన్నికల్లో బీజేపీ విజయంకోసం ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు వేములవాడ ఇంచార్జ్ మీసాల చంద్రయ్య, శంషాబాద్ ఓబీసీ మోర్చ శంషాబాద్ మండల అధ్యక్షులు మల్చాలం మోహన్ రావు  పాల్గొన్నారు.



 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: