తెలంగాణ ఉద్యమకారిణి కుటుంబానికి,,,

బాసటగా నిలిచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉద్యమకారిణి సుధ కూతురు కు ఎంబీబీఎస్ లో సీటు

ఫీజు నిమిత్తం లక్ష రూపాయలు అందజేసిన ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్, యువనేత కార్తీక్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ ఉద్యమకారిణి కుటుంభానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. ఆ ఉద్యమకారిణి ఇంట పుట్టిన చదవుల తల్లికి నగదు ప్రోత్సాహం అందించి ఉద్యమకారులకు మేం ఉన్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారిలో భరోసా నింపారు. అలా ఓ విద్యా కుసుమానికి మంత్రి అండగా నిలిచారు. మంచి ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీటు సాధించిన ఆ విద్యార్థినికి ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల సహాయం అందించారు.


ఇటీవల సరూర్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారిణి, ప్రస్తుత బిఆర్ఎస్ నాయకురాలు  సుధ కూతురు వెన్నెల చదువులో బాగా రాణించడంతో ఆమెను మంత్రి సబితా  ఇంద్రారెడ్డి అభినందించారు. ఆ సమయంలో వెన్నల ఎంబీబీఎస్ సీటు ఫీజుకు సంభందించిన విషయం మంత్రి దృష్టికి రాగా అక్కడికక్కడే సబితా ఇంద్రారెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఫీజుకు సంభందించిన లక్ష రూపాయల చెక్ ను ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ రెడ్డి సుధకు అందజేసారు. ఈ సందర్భంగా సుధ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ ఉద్యమకారిణి సుధా ఆమె కూతురు వెన్నెల ధన్యవాదాలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: