ఆటల పోటీలలో గెలిచిన కప్పులతో...

విజయోత్సవ ర్యాలీ

సంబరాలు చేసిన గడివేముల జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు

(జానో జాగో వెబ్ న్యూస్ నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు నిర్వహించిన మండల స్థాయి సెకండ్ లెవెల్ ఆటల పోటీలలో పాల్గొని గెలిచి సాధించిన కప్పులతో గడివేముల గ్రామంలోని పురవీధులలో విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు భారీగా ర్యాలీ నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు.


ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆటలలో విద్యార్థిని, విద్యార్థులకు మంచి నైపుణ్యాలను, శిక్షణ ఇచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ ను అభినందించారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: