నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ...
హెచ్చరిక జారీచేసిన గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య హెచ్చరికలు జారీ చేశారు. వివరాలలోకి వెళ్తే గడివేముల మండల పరిధిలో డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా, ఆనందంగా, తల్లిదండ్రుల మధ్యన జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారులపై నూతన సంవత్సర కేకులను కట్ చేసుకోవడం,బాణసంచా కానీ విపరీత శబ్దాలతో కూడిన వాహనాలను నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు చేపట్ట రాదని రాత్రి పది గంటల నుండి సెక్షన్ 30 అమలులో ఉంటుందని,
రాత్రి సమయంలో పోలీసులు పర్యవేక్షిస్తుంటారని,రాత్రి సమయంలో గ్రామంలో పిల్లలను తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని,రాత్రి సమయంలో అనుకోని ప్రమాద సంఘటనలు జరుగుతే నూతన సంవత్సరం విషాదంగా మిగులుతుందని అలా జరగకుండా ఉండాలంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవాలని గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.
Post A Comment:
0 comments: